ఒక ఊరిలో ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్న కుమారుడు ఒక రోజు తన తండ్రిని దగ్గరకు వచ్చి,
“నాన్నా, మీ ఆస్తిలో నాకు రావలసిన భాగం ఇప్పుడే నాకు ఇవ్వండి” అని అడిగెను.
తండ్రి అతని మాటకు బాధపడినప్పటికీ, తన ఆస్తిని ఇద్దరు కుమారుల మధ్య పంచి, చిన్న కుమారునికి అతని భాగాన్ని ఇచ్చెను.
చిన్న కుమారుడు ఆ ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్లెను. అక్కడ అశ్రద్ధగా జీవించి, తన ఆస్తినంతటిని వృథా చేసెను. కొంతకాలానికి ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చెను. అతనికి తినడానికి ఏమి లేక, పని కూడా దొరకలేదు.
అప్పుడు అతడు ఆ దేశంలోని ఒక యజమానుని దగ్గరకు వెళ్లి పని అడిగెను. ఆ యజమానుడు అతనిని పందులు మేపే పనికి పెట్టెను. అతడు ఆకలితో అలమటించుచుండెను. పందులు తినే పొట్టులు అయినా తినాలని అనిపించెను గాని, వాటిని కూడా ఎవ్వరూ ఇవ్వలేదు.
అప్పుడు అతనికి తన తండ్రి గుర్తొచ్చెను.
“నా తండ్రి ఇంటిలో ఎంతోమంది కూలివారు ఉన్నారు. వారికి తిండి చాలుగా ఉంది. కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్లి, ఆయన దగ్గర కూలివాడిగా అయినా పని చేసుకుంటాను” అని అనుకొనెను.
అలా నిర్ణయించుకొని అతడు తన తండ్రి ఇంటివైపు వెళ్లెను. అతడు ఇంకా దూరంలో ఉండగానే, తండ్రి అతనిని చూసి కనికరంతో పరుగెత్తుకొని వచ్చి, తన కుమారుని హత్తుకొనెను. అతనిపై అపారమైన ప్రేమను చూపెను.
తండ్రి అతనిని ఇంట్లోకి తీసుకువెళ్లి, ఆనందంగా పండగ జరిపెను.
ఎందుకంటే,